రోడ్లు ఊడ్చిన నరసరావుపేట కమిషనర్ రమ్య కీర్తన

నరసరావుపేటలో "ఆపరేషన్ క్లీన్ స్వీప్" కార్యక్రమంలో భాగంగా, మున్సిపల్ కమిషనర్ బి. రమ్య కీర్తన శనివారం స్వయంగా రోడ్లు ఊడ్చి పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలు, ఆస్పత్రులపై అధికారులు నోటీసులు జారీ చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, మున్సిపల్ నిబంధనలు పాటించాలని కమిషనర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్