నగరం మండలంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో శక్తి వంచన లేకుండా పనిచేస్తానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై చెన్నకేశవులు స్పష్టం చేశారు. బుధవారం ఆయన పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు. వేసవికాలంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలలో అనుమానితులు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.