రేపల్లె బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి సోమవారం జరిగిన ఎన్నికల్లో మేకా పూర్ణచంద్రరావు 110 ఓట్లతో విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి గురివిశెట్టి వెంకట శివయ్యకు 65 ఓట్లు వచ్చాయి. మొత్తం 198 ఓట్లకు గాను 176 ఓట్లు పోలయ్యాయని ఎన్నికల అధికారి జి. ప్రశాంత్ కుమార్ తెలిపారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మేకా పూర్ణచంద్రరావుకు అభినందనలు తెలిపారు.