సత్తెనపల్లిలో రవాణా శాఖ అధికారులు ఆటోలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మొత్తం 20 ఆటోలను పరిశీలించగా, నిబంధనలు ఉల్లంఘించిన 7 వాహనాలకు రూ. 18,660 జరిమానా విధించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఓవర్లోడింగ్ చేయొద్దని, రవాణా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు హెచ్చరించారు.