బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామంలో ఆదివారం ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన మురుగును తొలగించే కార్యక్రమాన్ని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మైనేని మురళి కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దీర్ఘకాలంగా ఉన్న గుర్రపు డెక్క నాచును తొలగించి, నీరు సక్రమంగా ప్రవహించేలా పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.