టీడీపీతో టచ్ లో లేను.. బాలినేని క్లారిటీ

ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడుతున్నారనే వార్తలపై ఆయన శనివారం స్పందించారు. తాను పార్టీ మారుతున్నాననే ప్రచారం అసత్యమని తెల్చి చెప్పారు. టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నాననే వార్తలు నిజం కాదని అన్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఒంగోలు నుంచే పోటీ చేస్తానని బాలినేని తెలిపారు.

ట్యాగ్స్ :