ఆధార్ కార్డు లేని పిల్లలకు పాఠశాలలో అడ్మిషన్లు కల్పిస్తామని చెన్నూరు మండల విద్యాశాఖ అధికారిని ఎన్. సునీత అన్నారు. గురువారం చెన్నూరు మండల కేంద్రంలోని ఇటుకల బట్టి వద్ద ఉన్న బడి బయట పిల్లలకు పాఠశాలలో ప్రవేశాలు కల్పిస్తామని పాఠశాలలకు పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆధార్ కార్డును చేయించుకుని పాఠశాలలో సమర్పించాలని తెలిపారు.