పొద్దుటూరులోని రామేశ్వరం రిజర్వ్ ఫారెస్టులో బుధవారం అధికారులు ఆక్రమణలను తొలగించారు. అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా ఈ కూల్చివేత చేపట్టారు. కోర్టు ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఎఫ్ ఆర్ ఓ హేమాంజలి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వ ఉదయ భాస్కర్, రూరల్ ఎస్సై రాజు పాల్గొన్నారు.