ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమం నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ప్రజలందరూ సంతృప్తి చెందేలా అధికారులు సేవలందించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతిలోని సచివాలయం నుండి చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్నదాత సుఖీభవ - పి4 తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.