AP: విశాఖ ఉక్కుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. 100 శాతం పెట్టుబడులు ఉపసంహరణ ఉంటుందని మరోసారి ప్రకటించింది. దీంతో కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రశ్నించగా ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు.