పట్టుదల, నిరంతర కృషి ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని కలెక్టర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. పదో తరగతి ఫలితాల్లో 597 మార్కులతో రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించిన ఆలమూరు విద్యార్థి శశాంక్ సూర్య వర్షిత్ను మంగళవారం కలెక్టరేట్లో ఆయన అభినందించారు. విద్యార్థికి జ్ఞాపిక అందజేసి సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.