అవనిగడ్డ మోదుమూడి ఎస్సీ కాలనీలో నాలుగు రోజులుగా త్రాగునీటి సరఫరా నిలిచిపోయింది. మోటార్ మరమ్మతుకు గురవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ సమస్యపై పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపించారు. దీంతో, గ్రామానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్మశానం వద్ద పాడుబడిన బావి నుండి నీటిని తెచ్చుకుని అవసరాలు తీర్చుకుంటున్నామని మహిళలు వాపోయారు.