గుడివాడ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ ఎస్. మనోహర్ శనివారం హెడ్ వాటర్ వర్క్స్ను పరిశీలించారు. రిజిస్టర్ల నిర్వహణను తనిఖీ చేసి, వాటిని సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రెండు ఎస్. ఎస్ ట్యాంకులలోని నీటి మట్టాలను పరిశీలించి, వేసవి దృష్ట్యా పట్టణంలో నిరంతర నీటి సరఫరా కోసం తగిన నీటి మట్టాలను కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు.