కృష్ణా మచిలీపట్నంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గొడౌన్ ను నెలవారి తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం ఉదయం తనిఖీ చేశారు. తొలుత గొడౌన్ సీళ్లను పరిశీలించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అనంతరం సంబంధిత రికార్డులు పరిశీలించి రికార్డ్ లో సంతకం చేశారు.