జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం రైలుపేటలోని వైఎస్ఆర్ నగర్ వద్ద బీఎల్వోల ద్వారా ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) పంపిణీ, స్వీకరణ, డిజిటైజేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఇంటింటి సర్వే పకడ్బందీగా జరుగుతోందని, బీఎల్వోలు, అధికారులు ఈసీఐ నియమ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని సూచించారు.