కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ పరిధిలోని గ్రామాల్లో వేసవి కాలంలోనూ మంచినీరు రోడ్లపై వృధాగా ప్రవహిస్తోంది. మున్సిపల్ వాటర్ సరఫరా అవుతున్నా, అధికారుల పర్యవేక్షణ లోపం, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వేల లీటర్ల నీరు వృధా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్-ఆఫ్ వాల్వ్లు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.