మచిలీపట్నం: విద్యుత్ దీపాలు పనిచేయకపోతే కఠిన చర్యలు

జిల్లా పరిధిలోని జాతీయ రహదారులపై విద్యుత్ దీపాలు సక్రమంగా పనిచేయకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన అజెండా అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

సంబంధిత పోస్ట్