మైలవరం మండలం చంద్రాలలో అర్ధరాత్రి ఊర చెరువు నుండి ఇటుక బట్టీలకు మట్టి తరలిస్తున్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నల్లచెరువులో రెండు JCPలను ఏర్పాటు చేసి, 50 ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారని వారు తెలిపారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఇటుక బట్టీల వల్ల చంద్రాల, గణపవరం ప్రాంతాలు కాలుష్యంతో బాధపడుతున్నాయని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.