ఇబ్రహీంపట్నం MRO వెంకటేశ్వర్లు సోమవారం కొండపల్లి ఇంధన ఫీలింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు. నిర్వాహకులతో మాట్లాడి, నిత్యం సరఫరా కంటే 15 శాతం ఎక్కువగా ఆయిల్ వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల్లో అభద్రతా భావం వల్ల డిమాండ్ పెరిగిందని, డ్రమ్ముల్లో, క్యాన్లలో పెట్రోల్ నింపరాదని, పరిమితంగా వాహనాలకు అందజేయాలని ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.