మొవ్వ-అయ్యంకి ఆర్ అండ్ బి రహదారి అభివృద్ధికి రూ. 3. 30 కోట్లతో చేపట్టిన పనులను ఎమ్మెల్యే వర్ణ కుమార్ రాజా పరిశీలించారు. నాగపట్నం రొయ్యల ఫ్యాక్టరీ నుంచి మొవ్వ కోర్టు వరకు 1. 6 కి. మీ మేర కొత్త రహదారిని రూ. 2. 50 కోట్లతో నిర్మిస్తున్నారు. మిగిలిన మార్గానికి రూ. 80 లక్షలతో మరమ్మతులు చేపట్టారు. బిటుమెన్ కొరత వల్ల పనులు ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుతం సరఫరా పునరుద్ధరించడంతో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.