పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 75 ఫిర్యాదులు

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ (PGRS) కార్యక్రమంలో ఇంచార్జ్ కమిషనర్ సర్వ శ్రేష్ట త్రిపాటికి ప్రజల నుంచి 75 ఫిర్యాదులు అందాయి. భూ, ఆస్తి వివాదాలు, మోసాలు, దొంగతనాలు, మహిళా సంబంధిత నేరాలు, కొట్లాట వంటి అంశాలపై ఎక్కువ వినతులు వచ్చాయని అధికారులు తెలిపారు. నిర్దేశించిన కాలపరిమితిలోగా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్