విజయవాడ రామలింగేశ్వర నగర్లోని సీవేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ను గురువారం కమిషనర్ ధ్యానచంద్ర పర్యటించారు. దుర్వాసన నియంత్రణ చర్యలను సమీక్షించారు. ప్రస్తుతం ఉన్న దుర్వాసన శాతం, ఓడర్ కంట్రోల్ యూనిట్ ద్వారా ఎంత మేర తగ్గుతోందన్న వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.