విజయవాడలోని సిద్ధార్థ కళాశాల వద్ద గురువారం మాచవరం సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా ఏసిపి దామోదర్ వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కార్లలో సీటు బెల్ట్ వాడటం తప్పనిసరి అని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు.