ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ను హైకోర్టు ఆదేశించింది. మార్చి 5వ తేదీలోపు హాజరు కావాలని, కఠిన చర్యలు తీసుకోకుండా చట్ట ప్రకారం విచారించాలని సూచించింది. సోమవారం జరిగిన విచారణలో, రాజకీయ కారణాలతో తనను నిందితుడిగా చేర్చారని సునీల్ తరఫు న్యాయవాది వాదించారు. మార్చి 9న ప్రధాన బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది.