ఆదోని సబ్ డివిజన్ పరిధిల సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆధ్వర్యంలో గురువారం 62 గ్రామాల వీఆర్వోలకు, సంబంధిత అధికారులకు రీసర్వే ప్రాజెక్ట్పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ రీసర్వే ద్వారా గ్రామాల భూ సరిహద్దులను సరిచేసి ప్రజలకు పారదర్శకమైన భూ రికార్డులు అందించడం ప్రధాన లక్ష్యమని, భూ వివాదాలు తగ్గి శాశ్వత భూ పత్రాలు అందుతాయన్నారు.