ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన వేలం పాటల్లో వారపు సంతను బి. లక్ష్మీదేవి రూ. 7. 50 లక్షలకు, దిన మార్కెట్ను బి. సుబ్బలక్ష్మి రూ. 7. 30 లక్షలకు, బస్టాండ్ను బి. లక్ష్మీదేవి రూ. 16. 50 లక్షలకు, కబేలాను జె. సునీల్ రూ. 3. 86 లక్షలకు దక్కించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మున్సిపాలిటీకి ఆదాయం గణనీయంగా పెరిగిందని కమిషనర్ కిషోర్ తెలిపారు.