నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ బేతంచెర్ల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించిన ఆయన, ఫింగర్ ప్రింట్ పరికరం వినియోగంపై సమీక్షించారు. బ్లాక్ స్పాట్ల వద్ద ప్రత్యేక చర్యలు, మద్యం సేవించి డ్రైవింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేసి, ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ తనిఖీలో స్టేషన్ లోని పలు అంశాలపై ఆయన దృష్టి సారించారు.