కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై మంగళవారం ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి పాల్గొని, నియోజకవర్గ అభివృద్ధి పనులు, సాగునీటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం, పెండింగ్లో ఉన్న నీటిపారుదల సమస్యలను పరిష్కరించడం, జిల్లా సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం వంటి అంశాలపై చర్చించారు.