గూడూరు: సమాచార హక్కుపై అవగాహన అవసరం: సబ్ రిజిస్ట్రార్

సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గూడూరు సబ్ రిజిస్ట్రార్ శ్రీధర్ గుప్తా గురువారం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పేర్కొన్నారు. ఈ చట్టం పారదర్శకత, జవాబుదారితనం పెంచి, అవినీతి రహిత పాలనకు దోహదపడుతుందని తెలిపారు. ప్రజలు చట్టంపై అవగాహన పెంచుకుని, ఇతరులకు చైతన్యం కల్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఎల్. వెంకటేశ్వర్లు, రెవెన్యూ అధికారులు, రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్