కర్నూలు జిల్లా జీడీపీ లక్ష్యాలను చేరుకోవడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర పథకాలు, కీపీఐలు, పర్యాటకం, పెట్టుబడులపై చర్చించారు. వ్యవసాయం, పశువర్ధక శాఖలు పురోగతి సాధించాయని, వెనుకబడిన సూచికలపై దృష్టి పెట్టాలని సూచించారు. బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్లు, గ్రీనరీ పెంపునకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.