గోస్పాడు మండలం పసురుపాడు గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ రాజకుమారి తనిఖీ చేశారు. అక్కడ అందుబాటులో ఉన్న సేవలు, సదుపాయాలపై ఆరా తీసి, రికార్డులు, హాజరు వివరాలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.