పి4 విధానంలో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వాములు కావాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా విజ్ఞప్తి చేశారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పి4 విధానంపై పరిశ్రమల యాజమాన్యాలు, ఇండస్ట్రియల్ అసోసియేషన్ ల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వాములయి, అత్యంత పేదలుగా గుర్తించబడిన బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని, వారి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు.