కర్నూలు జిల్లాలో ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ఇటీవల కర్నూలులో ఆన్లైన్ పెట్టుబడి మోసాలు పెరిగాయని, మోసగాళ్లు సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. పెట్టుబడులకు సంబంధించి అనుమానాస్పద లింకులను పరిగణనలోకి తీసుకోకుండా, వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు.