నంద్యాల: ప్రజా సమస్యల వేదికకు 80 ఫిర్యాదులు

నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ 80 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, చట్టపరంగా విచారణ చేసి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్