శ్రీశైలం ఆలయ వెబ్సైట్లో ఆర్జిత సేవలు, పూజలు, అలంకరణల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ ఆదేశించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ సమాచారాన్ని ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని ఈవోకు సూచించారు. దీనివల్ల భక్తులకు సమాచార సేకరణ సులభతరం అవుతుంది.