శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, దేవస్థానంలో ప్రతి ఉద్యోగి భక్తుల సదుపాయాల కల్పననే ప్రధాన లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. దర్శనం, మంచినీరు, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం వంటి సేవలపై భక్తుల నుంచి 90 శాతం సానుకూల స్పందన రావాలని ఆయన అన్నారు. శివసేవకులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్వచ్ఛంద సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకుంటామని తెలిపారు.