AP: మంత్రి కందుల దుర్గేష్ మానవత్వం చాటుకున్నారు. మంత్రి దుర్గేష్ సోమవారం రాజమండ్రి హైవేపై వెళుతుండగా అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించి వెంటనే కారును పక్కకి ఆపారు. అనంతరం బాధితుడిని తన వాహనంలో ఆసుపత్రికి తరలించాల్సిందిగా దుర్గేష్ అధికారులను ఆదేశించారు. తన కారు ఇచ్చి బాధితుడిని ఆసుపత్రికి పంపారు. అతడికి అత్యవసర వైద్యం అందేలా మంత్రి చర్యలు తీసుకున్నారు.