నామినేటెడ్ పోస్టులపై మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు

AP: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు ఎన్‌ఎండీ ఫరూఖ్‌, ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఫరూఖ్‌ మాట్లాడుతూ.. నామినేటెడ్ పోస్టుల విషయంలో తుది నిర్ణయం అధిష్ఠానానిదేనన్నారు. పార్టీ కోసం అంకితభావంతో‌ పనిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి పార్టీ శ్రేణుల నుంచి పేర్లు తీసుకున్నట్టు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్