AP: మధ్యాహ్న భోజన కార్మికులకు ఈ ఏడాది ఏప్రిల్ నెల వరకు జీతాలు/వేతనాలను ప్రభుత్వం చెల్లించిందని అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల నిలిచిన స్వల్ప బకాయిలను కూడా త్వరితగతిన విడుదల చేయడానికి నిధులు సమకూరాయని, త్వరలోనే ఆ నిధులు నేరుగా మధ్యాహ్న భోజన కార్మికుల ఖాతాల్లో జమ అవుతాయని అధికారులు వెల్లడించారు. గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన దాదాపు రూ.350 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.