నెల్లూరు జిల్లా అనంతసాగరం పోలీస్ స్టేషన్లో నూతన ఎస్సైగా రాజేష్ బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వచ్చిన ఆయన, మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపడతామని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఎస్సై రాజేష్ సూచించారు.