సంగం: వీఆర్వో నిర్లక్ష్యం… కలెక్టర్ సస్పెన్షన్ చర్య

సంగం మండలం పెరమణ గ్రామ వీఆర్వో కేశవమూర్తిపై కలెక్టర్ హిమాన్షు శుక్లా నిర్లక్ష్యం కారణంగా చర్యలు తీసుకున్నారు. తన పరిధిలోని గ్రీవెన్స్ అర్జీలను పట్టించుకోకపోవడం, గ్రామస్థుల వినతులపై నివేదికలు సమర్పించకపోవడం, విధులకు సక్రమంగా హాజరుకాకపోవడం, PGRS అర్జీల విచారణకు గైర్హాజరవడం వంటి ఆరోపణలపై ఆయనను సస్పెండ్ చేశారు. పూర్తి స్థాయి విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్