కందుకూరులో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో, విద్యుత్ లైన్ల మార్పు కోసం శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు AE నరసింహం తెలిపారు. SM హాస్పిటల్ ఏరియా, కోటకట్ట వీధి, పాత బ్యాంక్ బజార్, తాలూకా ఆఫీస్ ఏరియా, బూడిదపాలెం, మక్కా మసీదు ప్రాంతం, సంతోష్ నగర్, పెద్ద బజార్లోని కొంత భాగం, అన్నక్యాంటీన్ ఏరియాలో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు.