జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కావలి ముసునూరు అండర్పాస్ బ్రిడ్జి, ఇంద్రమ్మ కాలనీ ప్రాంతాలను పరిశీలించారు. పనుల పురోగతిని, నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అండర్పాస్ వద్ద వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇంద్రమ్మ కాలనీలో మౌలిక సదుపాయాలపై స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.