కావలి పట్టణంలోని ఉదయగిరి రోడ్డులో బాపూజీ నగర్ మున్సిపల్ ప్లాట్ల నుంచి ఐడీఎస్ఎంటీ లేఅవుట్ వరకు సుమారు కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డుకు కలెక్టర్, కావలి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానికులు ఈ పనిపై సంతోషం వ్యక్తం చేశారు.