గురువారం అమరావతిలోని ఏపీ శాసనమండలి ప్రాంగణంలో ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీలకు ప్రోటోకాల్ పాటించని అధికారులను కమిటీ విచారించింది. అధికారుల వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో, మరోసారి సమావేశానికి హాజరుకావాలని కమిటీ సభ్యులు ఆదేశించారు.