డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ జనసేన నేత కిశోర్ నెల్లూరు ఆరో పట్టణ సీఐ సాంబశివరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. తమ నాయకుడిపై మరోసారి ఇలాంటివి జరిగితే సహించమని ఆయన హెచ్చరించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.