నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకొని నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు కార్పొరేషన్ ఇంచార్జ్ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ వై. ఓ నందన్ లు బుధవారం ఒక సంయుక్త ప్రకటన ద్వారా తెలిపారు. నూతన సంవత్సరం వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో ప్రజలంతా సంతోషంగా గడుపుకోవాలని వారు ఆకాంక్షించారు.