ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఏప్రిల్ 1వ తేదీన నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా, వింజమూరు ప్రాంతంలో గెస్ట్ హౌస్ నిర్వహణ బాధ్యతలను నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ కు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు, నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తో కలిసి కమిషనర్, ముఖ్యమంత్రి పర్యటన ప్రదేశాల పరిశీలనలో భాగంగా వింజమూరులోని గెస్ట్ హౌస్ ప్రాంగణాన్ని పరిశీలించారు.