రబీ పంట నష్టం గణనపై ఉత్తర్వులు

AP: రబీ పంట నష్టం గణనపై రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24లోగా రబీ పంట నష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. 33 శాతానికి పైగా దెబ్బతిన్న పంటల వివరాలు నమోదు చేయాలని స్ప‌ష్టం చేశారు. ఒక్కో రైతుకు 5 ఎక‌రాల‌కు మించకూడదని పేర్కొన్నారు. కాగా, ఈ నెల 25 నుంచి 27 వరకు రైతు భ‌రోసా కేంద్రాల్లో అభ్యంతరాలను స్వీకరించి, 31న తుది జాబితా ప్రకటిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్