పార్వతీపురం జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పీజీఆర్ఎస్ వేదికను నిర్వహిస్తున్నామని కలెక్టర్ ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యల కోసం ప్రత్యేకంగా ‘రెవెన్యూ క్లినిక్’ ఏర్పాటు చేశామని చెప్పారు. అర్జీలు Meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని, వాటి స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నారు. ప్రతి సోమవారం అన్ని కార్యాలయాల్లో అర్జీలు స్వీకరిస్తున్నామన్నారు.